- Advertisement -
నవతెలంగాణ కాటారం
కాటారం మండలం కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ (ZPHS) హై స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం సందర్భంగా సర్పంచ్ కన్నీరు అరుణ స్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్లు పంపిణీ చేశారు. విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలుముల అశోక్, వార్డ్ సభ్యులు మంతెన సతీష్, తాటి మమత, తోడే కోమలత పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. చదువులో కృషి చేసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



