- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామంలో మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బర్రోళ్ళ అశోక్ రైతులకు జిలుగు విత్తనాలను సోమవారం అందజేశారు. జిలుగు విత్తనాలకు రైతులు పట్టదర్ పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని రావాలని, 30 కిలోల ఒక్కో బస్త రూ. 2137 చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి రాంబాబు, ఏ ఈ ఓ ఉమాదేవి, సొసైటీ సంఘ డైరెక్టర్లు పులమంటి గంగారం, మచ్చర్ల చిన్నయ్య, మచ్చర్ల రమేష్, కార్యదర్శి బి ప్రవీణ్, గ్రామ రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -