నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ పోతు రాజేశ్వర్ జ్ఞాపకార్థం కుమారులు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను వితరణ చేశారు. మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ పోతు రాజేశ్వర్ కుమారులు పోతు అంబరీష్, పోతు అర్జున్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి గారి జ్ఞాపకార్థం విద్యార్థులకు చేయూతను అందించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయుడిగా పదవి విరమణ పొందిన అనంతరం తమ తండ్రి కూడా ప్రతి సంవత్సరం పాఠశాలలో ఉత్తమ విద్యార్థులను సత్కరించడం, నోటు పుస్తకాలు, పెన్నులు అందించే వారిని గుర్తు చేసుకున్నారు. అందుకే వారి ఆనవాయితీని కొనసాగిస్తూ తాము కూడా ప్రతి సంవత్సరం విద్యార్థులకు చేయూత అందిస్తామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ పోతు రాజేశ్వర్ కుటుంబ సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్ హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, శిరీష, సుమలత, తదితరులు పాల్గొన్నారు.
తండ్రి జ్ఞాపకార్థం నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES