Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అతిసార వ్యాధి నియంత్రణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం

అతిసార వ్యాధి నియంత్రణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అతిసార వ్యాధి నియంత్రణపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా  అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్  అధ్యక్షతన నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ..స్టాప్ డయేరియా క్యాంపెయిన్ (అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం) ఈనెల 16వ తేదీ నుండి జూలై 31 వ తారీకు వరకు కొనసాగుతుందని,ముఖ్యంగా ఐదు సంవత్సరాలు లోపు పిల్లల్లో అతిసార వల్ల కలిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉందన్నారు. డయేరియా కి రోకతం ,సఫారీ ఔర్ ఓఆర్ఎస్ సే రకే అప్నా ధ్యాన్ అనే అంశం ని ఈ సంవత్సరం 2025 నినాదంగా ఇచ్చిందన్నారు.

2014 సంవత్సరంలో మొదలైన ఐడీసీఎఫ్ అనే కార్యక్రమాన్ని పేరు మార్చి స్టాప్ డయేరియా క్యాంపెయిన్గా గత సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓ ఆర్ ఎస్ మరియు జింక్ కార్నర్ ను ఏర్పాటు చేయాలని, ఐఇసిని ప్రదర్శిస్తూ ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని ఆశలు, ఏఎన్ఎంలు వారి వారి గృహ సందర్శనలో అతిసార వ్యాధి నియంత్రణ కార్యక్రమం పై ప్రతి ఇంటిలో అవగాహన కలిగించాలని కోరారు. ఈ అతిసారకు గురయ్యే చిన్నపిల్లలు ముఖ్యంగా మురికివాడలు, ఇటుక బట్టీలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టే ప్రదేశాలు , కరువు వరదలు సంభవించే ప్రదేశాలు ,వీధి బాలలు, అపరిశుభ్ర వాతావరణంలో తాగునీటి సౌకర్యం లేని పట్టణ మరియు గిరిజన ప్రాంతాల్లో నీ చిన్న పిల్లలు ఈ అతిసార వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. జిల్లాస్థాయి మరియు పిహెచ్సి స్థాయిలో వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలకు ఈ కార్యక్రమం పై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ప్రతి గ్రామంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ ద్వారా క్లోరినేషన్ చేయాలని అన్నారు. అతి సారా వ్యాధిలో కొద్దిపాటి, సాధారణం, మరియు తీవ్రమైన లక్షణాలు ఉంటాయని గుంతలు పడిన కళ్ళు, తగ్గిన మూత్ర విసర్జన, చిన్నపిల్లల్లో తలపై పాంటినెల్ల గుంతగా ఏర్పడడం, పొడి బారిన చర్మం ప్రధానమైన లక్షణాలుగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా 

అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలో భాగస్వాములైన వివిధ శాఖల అధిపతులు వారి వారి శాఖలో వైద్యశాఖ సమన్వయంతో అతిసార వ్యాధి నియంత్రణపై పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేతుల పరిశుభ్రత మరియు ఓఆర్ఎస్ ద్రావణం తయారు చేసే విధానంపై అంగన్వాడీ కార్యకర్తలకు వివరించాలన్నారు. శుద్ధి చేసిన నీటినే త్రాగాలని ,ప్రతి గ్రామంలోని నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, క్రమం తప్పకుండా వాటిని శుభ్రపరచాలన్నారు. మీ మీ శాఖల ఆధ్వర్యంలో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగిస్తూ అతిసార వ్యాధి నియంత్రణపై ముద్రించిన పోస్టర్లు ప్రదర్శించాల్సిందిగా వివిధ శాఖలకు సూచించారు. ఓ ఆర్ ఎస్ మరియు జింక్ మాత్రలు ప్రతి అంగన్వాడి కేంద్రం మరియు పాఠశాలల్లో అందుబాటులో ఉండేలాగా చూడాలన్నారు. ఈ కార్యక్రమం ను జూలై వరకు నిర్వహిస్తూనే ఈ సీజన్ అక్టోబర్ వరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే మురికివాడల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతిసార వ్యాధితో పాటు కిటకజనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి వాటిని అరికట్టే చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ పై ముద్రించిన పోస్టర్లను జిల్లా అడిషనల్ కలెక్టర్  చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది.జిల్లా 

ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్  మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించటానికి చక్కని ప్రణాళికతో వివిధ శాఖల సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి ప్రతి గ్రామంలో అతిసార వ్యాధితో ఏ ఒక్కరూ మరణం చెoదకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సాయ గౌడ్, డీ డబ్ల్యు ఓ రసూల్ బి, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈ ఈ ధర్మేందర్, మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ రాజు, పి ఓ లు రాజు, సుప్రియ,సానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా, సిడిపిఓ సౌందర్య, డిపిహెచ్ఎన్ఓ స్వామి సులోచన, డి హెచ్ ఈ హెచ్ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, రాజా బాబు, సచిన్ ,తరుణ్, వినోద్ ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -