- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారిణి డాక్టర్ ఎస్.జయలక్ష్మి బుదవారం మండలంలోని అశ్వారావుపేట (వినాయక పురం) ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్సలు, రక్త పరీక్షలు వివరాలను వైద్యాధికారి డాక్టర్ రాందాస్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నిర్వహణా రికార్డ్ లను పరిశీలించారు. ఆస్పత్రి లోని అన్ని విభాగాలను కలియ తిరిగారు. పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ రాందాస్ ను ఆదేశించారు.
- Advertisement -