- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. ఢిల్లీలో రెండో షోరూమ్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 11న ఈ కొత్త టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో, ”ఢిల్లీకి వచ్చేస్తున్నాం – వేచి చూడండి” అంటూ ఒక గ్రాఫిక్తో కూడిన పోస్ట్ను టెస్లా పంచుకుంది. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ఏరోసిటీ ప్రాంతంలో ఉన్న వరల్డ్మార్క్ 3 కాంప్లెక్స్లో ఈ కొత్త షోరూమ్ను ఏర్పాటు చేస్తున్నారు.
- Advertisement -