Monday, June 30, 2025
E-PAPER
Homeమెదక్( **డాక్టర్స్ డే స్పెషల్ ఆర్టికల్** )వాన కాలం జబ్బుల కాలం..

( **డాక్టర్స్ డే స్పెషల్ ఆర్టికల్** )వాన కాలం జబ్బుల కాలం..

- Advertisement -

జాగ్రత్తలు తప్పనిసరి

నవతెలంగాణ – దుబ్బాక 

వేసవి కాలం పోయి చల్లటి చిరుగాలితో పలకరించే వానకాలం వస్తే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు.? అయితే మనకే కాదు.. ఇది జబ్బులకు ఆహ్లాదకరమైన కాలమే.ఫ్లూ, డెంగీ, న్యూమోనియా, టైఫాయిడ్, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్ల వంటి ఎన్నో వ్యాధులు విజృంభిస్తుంటాయి.చాలా వరకు ఇవి మామూలుగా తగ్గిపోయేవే అయినా.. కొందరికి ప్రమాదకరంగా మారొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడే వారికి, వృద్ధులకు, పిల్లలకు, గర్భిణీలకు కొన్నిసార్లు ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వీటిని నివారించవచ్చు. ఒకవేళ వచ్చినా సత్వరము స్పందిస్తే తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలోనే రెండు రెట్లు ఎక్కువగా జబ్బుల బారిన పడుతుంటారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది హాస్పిటల్లలో చేరడం చూస్తుంటాం.ఈ కాలంలో వాతావరణం మారడమే కాదు కలుషితమమయ్యే నీరు, ముసురుకొచ్చే దోమలదండుతో జబ్బులు తీవ్రమయ్యే అవకాశం చాలా ఎక్కువ. అంతేనా.? అప్పటికే ఉన్న కొన్ని జబ్బులు తీవ్రం కావచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో వాతావరణం మారడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది .శ్వాస సంబంధిత వ్యాధులు అలర్జీలు, అస్తమా, సైన సైటిస్ వంటి సమస్యలు ఉధృతం అవుతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముందే డాక్టర్లను సంప్రదించి మందులు వాడాలి. ఈ ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే పాత జబ్బులు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి. ఈ కాలంలో తాగునీరు, ఆహార పదార్థాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. దీంతో వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్ వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి కాచి.. చల్లార్చి.. వడపోసిన నీటిని మాత్రమే తాగాలి. అప్పుడే వండిన ఆహారం తినాలి. ఆహార పదార్థాలు, తాగునీరు మీద ఈగలను వాళ్లనియ్యొద్దు. భోజనం చేసే ముందు, అలాగే మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. రోడ్ల వెంబడి, ఆరుబయట దొరికే చిరుతిళ్ళకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.వాన కాలంలో కొందరికి బ్యాక్టీరియాతో వచ్చే న్యూమోనియా ఎక్కువవుతుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి.. షుగర్, బీపీ, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడే వారికి దీని ముప్పు ఎక్కువ. కొందరికి దగ్గుతో పాటు చాతినొప్పి, చలి, ఆయాసం ఉండొచ్చు. ఇలాంటివి కనిపిస్తే కొందరు అత్యుత్సాహంతో తమకు తామే ట్రీట్మెంట్ చేసుకుంటారు. అలా చేయకూడదు. తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించి వారి సూచనలు మేరకే మందులను వాడాలి.వర్షాకాలంలో జబ్బులు ప్రబలే అవకాశం – డాక్టర్ అదీబా, మెడికల్ ఆఫీసర్  ,రామక్కపేట పీహెచ్ సీవర్షాకాలంలో నీరు కలుషితం అవడంవల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విరేచనాలు లాంటి జబ్బులు వస్తాయి. ఆరు బయట దొరికే చిరుతిళ్లు,ఆహార పదార్థాల కు వీలైనంత దూరంగా ఉండాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు వేడిగా వండుకొని తినాలి. డాక్టర్ సీహెచ్.ఉదయ్ , మెడికల్ ఆఫీసర్ తిమ్మాపూర్ పీహెచ్ సీ….చాలా మంది ఇళ్లల్లో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, వాడుకలో లేని డ్రమ్ముల్లో వర్షం నీళ్ళు నిలవ ఉండి డెంగ్యూ దోమలు పెరిగే అస్కారం ఉంటుంది. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మలవిసర్జనకు కానీ, మూత్రానికి వెళ్లి వచ్చిన తర్వాత కానీ చేతుల్ని సబ్బుతో శుభ్రపరుచుకోవడం ముఖ్యం. తాగే నీటి పైన మూత పెట్టుకోవడం, కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వల్ల జబ్బులు అంత త్వరగా దరి చేరవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -