- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండల కేంద్రంలో శ్రీ వేయి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కొరకు ఆలూరు నుండి అమెరికాలో నివాసం ఉంటున్న గుర్రం త్రివేణి మల్లేష్ గౌడ్ 1,15,000/- లక్ష పదిహేను వెయ్యిల రూపాయలు విరాళం అందజేశారు,ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు పెద్ద మనసుతో విరాళం ఇచ్చిన మల్లేష్ గౌడ్ కుటుంబ సభ్యులను సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ స్వామి, అర్జున్ గౌడ్, మహేందర్ ,సతీష్, సింగిడి చిన్న గంగారం, నడకుడ గంగారెడ్డి, చిలక శ్రీనివాస్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -