- తాహశిల్దార్ రాజ మనోహర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ
నవతెలంగాణ జన్నారం
దళారులను రైతులు మోసపోవద్దని జన్నారం మండల మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, తహశీల్దార్ రాజమనోహర్ రెడ్డి సూచించారు. సోమవారం కిష్టాపూర్, పోన్కల్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చే వారి ధాన్యాన్ని తాలూ తప్పలు లేకుండా తీసుకురావాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే గోదాములకు తరలిస్తామన్నారు రైతులు సహకరించాలని కోరారు.
- Advertisement -