నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్కి వెళ్లొద్దని అమెరికన్లను అమెరికా హెచ్చరిస్తోంది. ఇరాన్కి వెళితే.. కలిగే ప్రమాదాల గురించి అమెరికన్లకు, ఇరానియన్ అమెరికన్లను హెచ్చరిస్తూ కొత్తగా అవగాహనా ప్రచారాన్ని యుస్ స్టేట్ డిపార్ట్మెంట్ చేపట్టింది. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ అమెరికన్లను, ముఖ్యంగా ఇరానియన్ వారసత్వం ఉన్నవారిని ఇరాన్కు వెళ్లవద్దని కోరారు.
గురువారం (జూలై 10) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇరాన్కు ప్రయాణించడం వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాల గురించి అమెరికన్లను, ముఖ్యంగా ఇరానియన్ అమెరికన్లను హెచ్చరిస్తూ..యుఎస్ స్టేట్ విభాగం కొత్త అవగాహన ప్రచారాన్ని చేపట్టింది. ఇరాన్ ద్వంద్వ జాతీయతను గుర్తించదు. నిర్బంధించబడిన యుఎస్ పౌరులకు కాన్సులర్ సేవలను నిరాకరిస్తుంది. బాంబు దాడి ఆగిపోయినప్పటికీ ఇరాన్కి వెళ్లడం అంత సురక్షితం కాదు. ఇరాన్కు ప్రయాణించకుండా అమెరికన్లను హెచ్చరించడానికి మేము ఒక కొత్త వెబ్సైట్ను ప్రారంభించాము. ఈ వెబ్సైట్లో శోధన చేస్తే.. మీకు సులభంగా అర్థమౌతుంది. ఇరాన్కి ప్రయాణించవద్దనే సందేశం స్పష్టంగా ఉంది. మీకు బహుళ భాషలలో సమాచారం అందుబాటులో ఉంది. మీరు అన్ని భాషలలో చెప్పగలరు. ప్రయాణ సలహాదారులకు కూడా ఇది అనుబంధంగా ఉంటుంది.’ అని ఆమె అన్నారు.