Monday, June 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొగాకు తీసుకోకండి, క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉండండి 

పొగాకు తీసుకోకండి, క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉండండి 

- Advertisement -

– జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి  

నవతెలంగాణ –  కామారెడ్డి: పొగాకును తీసుకొని క్యాన్సర్ వ్యాధిన పడకుండా ప్రజల జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు సైతం పిల్లలపై దృష్టి పెట్టి పిల్లలు పొగాకు అలవాటు పడకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యం లో అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే  సందర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంధాలయం సంస్థ లో చైతన్య ( అవగాహన) సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి  హాజరయి  పొగాకు యొక్క దుష్ప్రభావాలు, వాటి వల్ల  కలిగె నష్టాలు గూర్చి అవహగాన కల్పించారు. అనంతరం చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది  మాయ సురేష్, లైబ్రరీ లో చదువుతున్న నిరుద్యోగ యువతి యువకులతో  పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రమేష్  ఈ కార్యక్రమాన్నీ అధ్యక్షతనా  నిర్వహించారు.  ఈ కార్యక్రమం లో  న్యాయవాది వేణు ప్రసాద్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది ఎం శ్రీనివాస్ రావు,  జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా కేంద్ర గ్రంధాలయ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -