నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ‘దోస్త్’ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. మే 3 నుంచి 21 వరకు మొదటి దఫా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. రెండో దశలో మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయించనున్నారు. మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. మూడో దశలో జూన్ 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 23న సీట్ల కేటాయింపు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం.
- Advertisement -