- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి: మండల కేంద్రంతో పాటు బేగంపేట, వడ్లూర్ గ్రామ పంచాయతీలను శుక్రవారం డీపీఓ దేవకిదేవి సందర్శించి నర్సరీలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.నర్సరీల ప్రాముఖ్యత, చెత్త సేకరణ, పారిశుధ్యంపై డీపీఓ పంచాయతీ కార్యదర్శులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ ప్రవీన్, ఎంపీఓ మంజుల పాల్గొన్నారు.
- Advertisement -