– నేటికీ మూడు సంవత్సరాల పూర్తి
– శిలాఫలకాలుకి రంగులు వేసి గుర్తు చేసుకున్న డి ఎస్పీ నాయకులు
నవతెలంగాణ-కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజల రాజస్థాపనకై డాక్టర్ విశారదన్ మహరాజ్ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర నిజామాబాద్ జిల్లా పట్టణ కేంద్రానికి చేరుకొని నేటికీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా శిలాఫలకానికి రంగులు వేసి పూలమాలలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ మాట్లాడుతూ.. స్వరాజ పాదయాత్ర ఉద్దేశాన్ని గుర్తుచేస్తూ పాదయాత్ర లో విశారదన్ మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ భారత రాజ్యాంగ విలువలు,ఓటు హక్కు ప్రాముఖ్యత,మహనీయుల ఆశయ సాధన కై సాగిన పాదయాత్ర అనంతరం హైదరాబాదులో భారీ బహిరంగ సభ పెట్టి ధర్మసమాజ్ పార్టీని ఆవిష్కరించడం జరిగింది అని తెలియజేశారు. అణగారిన వర్గాల రాజ్యం కోసం ధర్మ సమాజ్ పార్టీ పాటు పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి సుమన్ మహారాజ్,జిల్లా నాయకులు ప్రశాంత్,రమేష్,మండలాల అధ్యక్షులు శ్రీకాంత్,ఉమేష్,గంగాధర్,కిషన్, పోచయ్య, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
డాక్టర్ విషాదన్ మహారాజ్ పదివేల కిలోమీటర్ల పాదయాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES