- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని గోల్కొండ తారామతి రిసార్ట్లో ఈగల్ టీమ్, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈవెంట్పై దాడులు జరిగాయి. ఈవెంట్లో పాల్గొన్న సుమారు 800 మందిలో 300 మందిని తనిఖీ చేయగా, 36 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒక మహిళతో సహా ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. ఈ ఘటనలో పలువురు బాలీవుడ్ నటులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.
- Advertisement -



