– నేడు ప్రణీత్రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్రావు విచారణ
– మాజీ ఐజీ ప్రభాకర్రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించిన అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును జూబ్లిహిల్స్ స్పెషల్ టీం అధికారులు శుక్రవారం తిరిగి ప్రశ్నించారు. దాదాపు ఆరు గంటలపాటు ప్రణీత్రావును అధికారులు విచారించారు. ఈ కేసు ప్రారంభ దశలోనే ప్రణీత్రావును అరెస్ట్ చేసి విచారించటం, అప్పటి తమ చీఫ్ అయిన ప్రభాకర్రావు ఇచ్చిన ఆదేశాల మేరకే తాము ఫోన్ట్యాపింగ్లు జరిపినట్టు ప్రణీత్రావు వాంగ్మూలమివ్వటం తెలిసిందే. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం ప్రణీత్రావు బెయిల్పై ఉన్నాడు. కాగా, తాజాగా ప్రభాకర్రావును రెండు మార్లు విచారించిన సిట్ అధికారులు.. తిరిగి శనివారం 14న విచారించనున్నారు. ఈ రెండు దఫాలుగా జరిగిన విచారణలో సైతం ప్రభాకర్రావు తాను ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడలేదనీ, ఆ విధంగా చేయాలని తమ అధికారులెవరినీ ఆదేశించలేదని తెలపటమేగాక కిందిస్థాయి అధికారులు ఈ విషయంలో తన పేరు బయట పెట్టటంపై మౌనం వహించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎస్ఐబీ కార్యాలయం కేంద్రంగా వార్రూం ఏర్పాటు చేసుకుని, ఫోన్ట్యాపింగ్ పరికరాలను సమకూర్చుకొని ట్యాపింగ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్రావును తిరిగి అధికారులు విచారించారు. ముఖ్యంగా, ఫోన్ట్యాపింగ్కు సంబంధించిన సాంకేతిక పరికరాలను, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని ఎవరు మిమ్మల్ని ఆదేశించారంటూ ప్రణీత్రావును సిట్ అధికారులు పదేపదే ప్రశ్నించినట్టు తెలిసింది. అందుకు తాను ఇదివరకు ఇచ్చిన తమ సమాధానాన్ని ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఫోన్ట్యాపింగ్లకు సంబంధించిన నెంబర్లతో పాటు కొందరు జడ్జిల కాల్ డేటాను సేకరించటానికి కూడా ‘హెడ్క్వార్టర్స్’ నుంచే తనకు ఆదేశాలు అందినట్టు ప్రణీత్రావు అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఈ మారు కూడా ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ను వీడియో చిత్రీకరణ జరుపుతూ సిట్ అధికారులు నమోదు చేశారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే శనివారం ప్రభాకర్రావును సిట్ అధికారులు విచారించనున్నారని తెలిసింది.
ఫోన్ట్యాపింగ్ కేసులోమరోసారి సిట్ ముందుకు డీఎస్పీ ప్రణీత్రావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES