- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలో గురువారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాఖీ పండుగ సోదరీ సోదరులకు ప్రత్యేక పండుగ రక్షాబంధన్ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
- Advertisement -