- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్థాన్లోని కునార్ ప్రావిన్స్లో సోమవారం సంభవించిన భూకంపం భారీ ప్రాణనష్టానికి దారితీసింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 622 మంది మృతిచెందారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ ప్రకటించింది. అదనంగా మరో 1,500 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. కూలిన ఇళ్ల శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చని స్థానిక అధికారులు తెలిపారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
- Advertisement -