- Advertisement -
– రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదు
కారకాస్: ఈక్వెడార్ తీరంలో భూకంపం సంభవించింది. యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం (ఈఎంఎస్సీ) రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని తెలిపింది. ఈ భూకంపం 77 కిలోమీటర్ల (47.85 మైళ్ళు) లోతులో సంభవించిందని చెప్పింది. ఏప్రిల్ 2016లో ఈక్వెడార్లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. మనాబి, ఎస్మెరాల్డాస్ ప్రావిన్సులలోని గ్రామాలను నాశనం చేసిన ఈ భూకంపంలో 673 మంది మరణించారు.
- Advertisement -