Monday, January 19, 2026
E-PAPER
Homeజాతీయంఉత్తర భారత్‌లో భూకంపం..

ఉత్తర భారత్‌లో భూకంపం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తర భారత్‌లో సోమవారం ఉదయం 8:44 గంటలకు భూకంపం సంభవించింది. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.8గా నమోదైంది. భూకంప కేంద్రం హర్యానాలోని సోనిపట్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -