Monday, June 9, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్రకాశం జిల్లాలో భూకంపం..

ప్రకాశం జిల్లాలో భూకంపం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో భూప్రకంపణలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు.
గత నెల 6న కూడా ప్రకాశం జిల్లా పొదిలిలో భూకంపం వచ్చింది. ఉదయం 9.54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొత్తూరులోని రాజు దవాఖాన వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలో ప్రకంపణలు వచ్చాయి. అంతకుముందు రోజు సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. గంగాధర, చొప్పదండిలోని వాస గృహాలు, దుకాణ సముదాయాలు, సూపర్‌మార్కెట్లలో సామానులు కిందపడిపోగా, ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందారు. నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో భూమి కంపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -