- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ రోజ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. గత డిసెంబరులో వరుస సల్ప భూకంపాలు ఇక్కడ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -