- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. తెల్లవారుజామున 1:43 గంటల ప్రాంతంలో ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ప్రకంపనలతో సముద్రంలో అల్లకల్లోలం నెలకొంది. కెరటాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తీర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
- Advertisement -