- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చైనాలో మరోసారి భూకంపం నమోదైంది. సిచువాన్ ప్రావిన్స్లోని యా’న్ నగరంలోని లుషాన్ కౌంటీలో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. మంగళారం తెల్లవారుజామున 3:21 గంటలకు సంభవించిన ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు చైనా భూకంప నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. లుషాన్, చెంగ్డూ, లెషాన్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి.
- Advertisement -