Friday, June 27, 2025
E-PAPER
Homeజాతీయంరాజ‌కీయ పార్టీల‌కు ఈసీ షాక్‌..

రాజ‌కీయ పార్టీల‌కు ఈసీ షాక్‌..

- Advertisement -

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో : రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను డీలిస్ట్‌ చేసే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. 2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఆరేండ్లలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను ( రిజిష్టర్డ్‌ అన్‌రికగ్నైడ్జ్‌ పొలిటికల్‌ పార్టీస్‌) గుర్తించింది. వాటిని డీలిస్ట్‌ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని గుర్తించి ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం వద్ద సుమారు 2,800కి పైగా గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవాలి. మిగిలిన పార్టీలను నమోదిత గుర్తింపులేని పార్టీలుగానే పరిగణిస్తారు. అయితే 345 పార్టీల పేర్లతో జాబితాను మాత్రం ఈసీ విడుదల చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -