Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనేటి నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌

నేటి నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌

- Advertisement -

– 17 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో బీటెక్‌, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్‌ ఎంట్రీ ద్వారా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఎ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలనీ, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని కోరారు. అదేనెల 17 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. అదేనెల 17 నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు. ఈనెల 25న తొలివిడత సీట్లు కేటాయిస్తామని వివరించారు. 25 నుంచి 29 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలనీ, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు ష్ట్ర్‌్‌జూర://్‌స్త్రవషవ్‌.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad