Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరాహుల్ గాంధీ “ఓట్ల చోరీ”పై ఈసీ స్పంద‌న‌

రాహుల్ గాంధీ “ఓట్ల చోరీ”పై ఈసీ స్పంద‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ ఓట్ల చోరీ కార్య‌క్ర‌మం ఎన్నిక‌ల సంఘం స్పందించింది. దొంగ ఓటు అనే పదాన్ని చెత్త పదంగా అభివర్ణించింది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడిగా, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది. 1951-52లో భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల నుంచి “ఒక వ్యక్తి, ఒక ఓటు” చట్టం అమలులో ఉందని ఈసీఐ నొక్కి చెప్పింది. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేసినట్లు రుజువు ఉంటే.. ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్‌తో కమిషన్‌కు సమర్పించాలని పోల్ బాడీ పేర్కొంది. ఓటర్లను ఆధారాలు లేకుండా “దొంగలు“ అని ముద్ర వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

దేశంలో ఓటర్ల జాబితాకు సంబంధించి రాహుల్‌ గురువారం ప్రజెంటేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఓట్ల చోరీ విధానం’ దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందని ఆయన ఆరోపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad