- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సన్ పరివార్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రూ.153 కోట్ల స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. అధిక మొత్తంలో వడ్డీ ఇస్తానంటూ మెతుకు రవీందర్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేశాడు. రెండు రాష్ట్రాల్లో కలిపి పది వేల మంది డిపాజిట్ దారుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. రవీందర్ తన కంపెనీలో పెట్టిన డబ్బులను దారి మళ్లించినట్లు, అతడి కుటుంబం సొంతానికి రూ.26 కోట్లు వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది.
- Advertisement -



