అకలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని విద్యా సంస్థలు, హాస్టళ్లను నిరంతరం సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పాఠశాలల్లో ఎక్కడ వాన నీరు, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే జెసిబి ని ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో ఆమె మాట్లాడుతూ పరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని, అందువల్ల మండలాల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు వారి మండలంలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేయాలని, ముఖ్యంగా పాఠశాల ఆవరణలో ముళ్ళ పొదలు, చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు వధాగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే గుర్తించి వాటివల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా కూలగోట్టాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ- 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, తదితర అన్ని అంశాల పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు . ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులన్నింటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జాప్యం లేకుండా ఫిర్యాదులు పరిష్కరిస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రజావాణిలో మొత్తం 129 దరఖాస్తులు రాగా, అందులో జిల్లా అధికారులకు 57, రెవెన్యూ శాఖకు సంబంధించి 72 దరఖాస్తులు వచ్చాయి. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,జెడ్ పీ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాస రావు, ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతు భరోసా. 678 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
రైతు భరోసా లో భాగంగా నల్గొండ జిల్లాలో సోమవారం వరకు 5 లక్షల 12 వేల మంది రైతులకు, 678 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఒక ప్రకటనలో తెలిపారు రైతు భరోసా” లో భాగంగా రైతుల సాగు పెట్టుబడికై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విజయవంతంగా రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 న రాష్ట్ర సచివాలయం వద్ద నిర్వహిస్తున్న రైతు సదస్సు కార్యక్రమాన్ని జిల్లాలోని 93 రైతు వేదికల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేసినట్లు . ఆమె తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, ఇతర మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారని, అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడతారని, అందువల్ల జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు సాయంత్రం 4 గంటలకే సంబంధిత రైతు వేదికలలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను ప్రతి రైతు వేదికకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
విద్యాసంస్థలను నిరంతరం సందర్శించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES