నవతెలంగాణ – పెద్దవంగర: తెలుగుదేశం పార్టీ మండల నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బైన బిక్షపతి నాలుగోసారి ఎన్నికయ్యారు. మండల ఉపాధ్యక్షుడిగా గద్ద హరీష్, ప్రధాన కార్యదర్శిగా చిలుక యాకసోములు, కోశాధికారిగా కొండ పద్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా రవికుమార్, కార్యదర్శిగా పాశం దేవేందర్ ఎన్నికైనట్లు వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ అర్పనపల్లి విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బైన బిక్షపతి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులను పోటీలో దింపుతామని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ మండల నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES