నవతెలంగాణ-తొగుట
గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ సర్పంచులు పనిచేస్తేనే నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ సర్పంచ్, సర్పంచుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నరసింహులు యాదవ్ ఆరోపించారు. మంగళవారం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తానని మని వివిధ సందర్భాలలో ప్రభుత్వం ప్రకటన చేస్తున్న సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం జరిగిన రైతు సదస్సులో సీఎం సర్పంచ్ల పదవీకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిం దని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 సంవత్సరంలో అధి కారంలోకి వచ్చిందని, 2024 ఫిబ్రవరి 2వ తేదీ వరకు మేము సర్పంచ్ పదవిలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం అది మరిచి సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనట్టు గా మాట్లాడడం సైరైన పద్దతి కాదన్నారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు పనిచేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. దయచేసి మా సర్పంచులు బిల్లులు విడుదల చేయాలని కోరారు.
మాజీ సర్పంచుల బిల్లులు విడుదల చేసిన తర్వాతే ఎన్నికలకు పోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES