Saturday, March 7, 2026
E-PAPER
Homeబీజినెస్మార్చ్ 6 నుండి మళ్ళీ అమెజాన్. ఇన్ లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ లైవ్

మార్చ్ 6 నుండి మళ్ళీ అమెజాన్. ఇన్ లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ లైవ్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: అమెజాన్ ఇండియా శాంసంగ్ గెలాక్సీ ఏఐతో సశక్తమైన ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) పునరాగమనాన్ని ప్రకటించింది. ఇది మార్చ్ 6 నుండి లైవ్ అవుతోంది. ఈ క్రికెట్ సీజన్లో, వివిధ శ్రేణుల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మొదలుకుని అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టివిలు, ల్యాప్ టాప్ లు అండ్ ట్యాబ్లెట్ల వరకు, ఎయిర్ కండిషనర్లు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కెమేరాలు, ఆడియో ఉపకరణాలు, ఇంకా మరిన్నింటిపై కస్టమర్లు గొప్ప డీల్సును, ఆఫర్లను పొందగలుగుతారు.

ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జెబా ఖాన్ మాట్లాడుతూగతసంవత్సరపు ఈపీఎల్ తమ అంచనాలను మించి విజయం సాధించిందన్నారు. ఈ ఏడాది, ప్రతి దిశలోనూ అదే ఆశయాన్ని సాధించాలని కోరుకుంటున్నామన్నారు. ఏఐ సశక్తమైనఏఐ పీసీలు మొదలుకుని స్మార్ట్ టీవీలు, ఆన్డివైస్ ఏఐ స్మార్ట్ ఫోన్ల వరకు ఉపకరణాలపై ఈ ఏడాది తమ దృష్టిని ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నామన్నారు. ఈ మార్పు తమ కస్టమర్లకు ప్రత్యక్షంగా అనుభవంలోకి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. కస్టమర్లు కనుగొనే, నిర్ణయించుకునే విధానం కూడా ఆవిర్భవించిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -