- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్లోని టోల్ ప్లాజా వద్ద ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా వద్ద క్యూ లైన్లో ఉన్న వాహనాలపై దాడి చేసే ప్రయత్నం చేసింది. డెహ్రాడూన్-హరిద్వార్ హైవేలోని లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ లైన్లో వెళ్తున్నాయి. ఓ ఏనుగు పక్కనే ఉన్న అడువుల్లోకి వెళ్తు టోల్ ప్లాజ్ వద్ద ఆగి ఉన్న వాహనాల వైపు వెళ్లింది. లైన్లో ఉన్న ఓ కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. తన తొండంతో కారు పైకి లేపి పడేసే ప్రయత్నం చేసింది.వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ స్పీడ్గా కారును ముందుకు కదిలించాడు. దీంతో, ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Advertisement -