- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డోజ్ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిన మాధ్యమం ఎక్స్లో ప్రకటన చేశారు. ‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్నకు ఆయన ధన్యవాదాలు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుంది’ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
- Advertisement -