– 1,05,416 పనులు చేయాలని నిర్ణయం
– 2025-26 నిర్దేశిత లక్ష్యం చేరేలా సర్కార్ ప్రణాళిక
– గతేడాది రూ.4,529.07 కోట్లతో 12.23 కోట్ల పని దినాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2025-26) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్)లో 3,696.00 కోట్ల నిధులతో పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేపట్టబోయే పనుల ప్రణాళికలు రూపొందించాలని ఈ మేరకు పంచాయతీ రాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశువుల కొట్టాలు, బావుల తవ్వకం, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, నీటి కుంటలు తదితర మొత్తం 17రకాల పనులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ఇప్పటి నుంచే అధికారులు చిత్త శుద్ధితో పని చేయాలని సంబంధిత అధికారులకు సర్కార్ దిశానిర్దేశం చేసింది. ”మహిళాశక్తి-ఉపాధి భరోసా” కింద రూ.293 కోట్లతో రాష్ట్రంలో 24,500 స్వయం సహాయక సంఘాలకు పనులు కల్పించనున్నారు. 11,400 పశువుల కొట్టాలు. 2,850 పచ్చిరొట్ట ఎరువుల తయారీకి అజోల పిట్లు, 5,700 వర్మి కంపోస్ట్ – వాన పాముల ఎరువుల తయారీకి తోట్లను నిర్మించాలని ప్రతిపాదించారు. 28,500 ఎకరాల్లో చిన్న, సన్నకారు రైతుల బీడు భూములను సాగులోకి తీసుకు రానున్నారు. 28.50 కోట్ల నిధులతో మండలానికి ఐదు చొప్పున 2,850 కోళ్ళ షెడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. ”పొలం బాటలు” కార్యక్రమం కింద ప్రతి నియోజక వర్గానికి రూ.2 కోట్లతో 1,920 కిలో మీటర్ల వ్యవసాయ పనులకు బాటలు వేయనున్నారు. ”ఫల వనాలు-పండ్ల తోటల పెంపకం” కింద 5,700 ఎకరాల్లో 34.20 కోట్లతో పండ్లతో టల పెంపకం, రూ.68.40 కోట్ల నిధులతో నర్సరీల ద్వారా ఈత మొక్క లను పెంచనున్నారు. ”జలనిధి” (వర్షపు నీటిని ఒడిసి పట్టడం) కార్యక్రమం కింద రాష్ట్రంలో రూ.458.85 కోట్లతో 31,920 నీటి నిల్వ, సంరక్షణ పనులను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. 570 చెక్ డ్యాములు, 2,850 ఊట కుంటలు, 5,700 ఫామ్ పాండ్స్ (పంట కుంటలు), 2,850 బోర్ వెల్ రీఛార్జి గుంతల నిర్మాణం, 570 వ్యవసాయ బావుల నిర్మాణం చేయను న్నారు. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచే లక్ష్యంగా రూ.646.30 కోట్లతో భూసారం పెంచే పనులను చేపట్టనున్నారు. ”గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన” కింద రూ.1095 కోట్ల నిధులతో ఇంకుడు గుంతలు, బాలికలకు మరుగుదొడ్లు, 570 కిలోమీటర్ల అంతర్గత సిమెంట్, కాంక్రీట్ రోడ్లు, 1,140 గ్రామ పంచాయతీ భవనాలు, 1,140 అంగన్వాడీ భవనాలు, 1. 14,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
గతేడాది 12.23 కోట్ల పనిదినాలు
గతేడాది రూ.4,529.07 కోట్లతో 12.23 కోట్ల పని దినాలను ఉపాధి హామీ చట్టం ద్వారా కల్పించారు. రాష్ట్రంలో జాబ్కార్డ్ ఉన్న వారందరికీ సగటున 45.82 పని దినాలను ప్రభుత్వం కల్పించింది. ఇందులో వేతనా లకు సంబంధించి రూ.2614.3 కోట్లు, మెటీరియల్ కోసం రూ. 1685.52 కోట్లు, నిర్వహణ వ్యయం రూ. 229.25 కోట్లు ఖర్చు చేశారు. సగటున రూ.213ను రాష్ట్రంలోని జాబ్కార్డ్దారులు రోజువారీ వేతనంగా పొందారు.
రూ.3,696 కోట్లతో ‘ఉపాధి హామీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES