Friday, May 30, 2025
E-PAPER
Homeజాతీయంఛ‌త్తీస్‌గ‌డ్ అడ‌వుల్లో ఎన్‌కౌంట‌ర్..మ‌హిళ మావోయిష్టు మృతి

ఛ‌త్తీస్‌గ‌డ్ అడ‌వుల్లో ఎన్‌కౌంట‌ర్..మ‌హిళ మావోయిష్టు మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఛ‌త్తీస్‌గ‌డ్‌ అడ‌వుల్లో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. బీజాపూర్ సరిహ‌ద్దులో మావోయిష్టుల‌కు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఓ మ‌హిళ మావోయిష్టు చ‌నిపోయిన‌ట్టు అధికారులు తెలిపారు. ఆమె నుంచి ప‌లు ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేస్తుకున్నామ‌ని అధికారులు చెప్పారు. మావోయిష్టుల ఏరివేత ల‌క్ష్యంగా కేంద్రం ఆప‌రేష‌న్ క‌గార్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ప‌లు రోజుల నుంచి బీజాపూర్ అడ‌వుల్లో DRG, STF, CRPF, CoBRA ద‌ళాలు కూంబింగ్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల్లో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌గా..భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మావోయిష్టులు తార‌స ప‌డ్డారు. దీంతో ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం కాల్పులు జ‌రుపుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ మావోయిష్టు మృతి చెంద‌గా..మిగిలిన పరారు అయ్యార‌ని అధికారులు చెప్పారు. ఈ కాల్పుల్లో కీల‌క నేత‌లు తీవ్రంగా గాయ‌ప‌డి ఉంటార‌ని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -