Friday, June 20, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు మావోయిస్టులు మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా చోటే భేతియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. కాంకేర్‌ జిల్లాలో ఆమతోల – కల్పార్‌ గ్రామాల మధ్య ఉన్న కొండ ప్రాంతాల్లో మావోయిస్టుల ఉన్నారన్న సమాచారం మేరకు బిఎస్‌ఎఫ్‌, డిఆర్‌జి భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్‌ను నిర్వహించాయి. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -