Sunday, June 15, 2025
E-PAPER
Homeజాతీయంమధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌

మధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

– బాలాఘాట్‌లో ఎదురుకాల్పులు
– నలుగురు మావోయిస్టులు మృతి
– వారిలో ముగ్గురు మహిళలే..
బాలాఘాట్‌:
బిత్లీ చౌకి పరిధిలోని పచామా దాదర్‌ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో శనివారం మరోసారి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా వారిలో ముగ్గురు మహిళలే ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సంఖ్య ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉన్నది. బాలాఘాట్‌కు కొత్తగా నియమితులైన ఎస్పీ ఆదిత్య మిశ్రా ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసుల కూబింగ్‌ జరుగుతోందని తెలిపారు.మరోపక్క కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 వరకు మావోయిస్టుల్లేకుండా చూస్తామని హెచ్చరికల నేపథ్యంలో దేశంలో ఎక్కడో చోట ఎన్‌కౌంటర్ల పేరిట రక్తపాతం జరుగుతోందని పౌర సమాజం ఆరోపిస్తున్నది. పోలీసు సిబ్బంది ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించడం, నిరంతర సోదాలు, ప్రభుత్వం జారీ చేసిన గడువు కారణంగా మావోయిస్టుల్లో నైతిక స్థైర్యం ఇప్పుడు దెబ్బతింటున్నట్టు కనిపిస్తోందని కేంద్రబలగాలు పేర్కొంటున్నాయి. దీని ఫలితంగా ఇప్పుడు మావోయిస్టులు.. ఎన్‌కౌంటర్లలో చంపబడుతున్నారు లేదా వారు స్వయంగా లొంగిపోతున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒడిశాలో పేలిన ఐఈడీ : సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి
ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో శనివారం మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన ఒడిశా పోలీసులు.. ఐఈడీ పేలిన పరిసర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. మృతి చెందిన సీఆర్పీఎఫ్‌ ఆఫీసర్‌ను ఏఎస్‌ఐ సత్యబాన్‌ కుమార్‌ సింగ్‌(34)గా గుర్తించారు. ఈయన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌ జిల్లా. రూర్కేలాలోని కే బాలంగ్‌ గ్రామ సమీపంలోని అడవుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్లు, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ పోలీసులు కలిసి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ అధికారి సత్యబాన్‌ కుమార్‌ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను రూర్కేలాలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం 6 గంటలకు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -