- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. తొలి ఇన్నింగ్స్లో 359/3 స్కోరుతో టీమ్ఇండియా రెండో రోజు ఆటను మొదలు పెట్టింది. 65 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బషీర్ వేసిన 99.1 ఓవర్కు సిక్స్ కొట్టి టెస్టుల్లో ఏడో సెంచరీ అందుకున్నాడు. 100 ఓవర్లకు భారత్ స్కోరు 426/3. శుభ్మన్ గిల్ (144), పంత్ (112) పరుగులతో ఉన్నారు.
- Advertisement -