- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత పేసర్లు హడలెత్తిస్తున్నారు. నాలుగో రోజు తొలి సెషన్లో బుల్లెట్ లాంటి బంతులతో బుమ్రా చెలరేగుతుండగా.. స్పీడ్స్టర్ సిరాజ్ భారత్కు బ్రేకిచ్చాడు. స్వీప్ షాట్తో బౌండరీ సాధించిన బెన్ డకెట్(12)ను ఔట్ చేశాడు. గ్రౌండ్ షాట్ ఆడబోయిన డకెట్ మిడాన్లో బుమ్రా చేతికి చిక్కాడు. అంతే.. 22 వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జాక్ క్రాలే (6), ఓలీ పోప్(0)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ 22 పరుగుల ఆధిక్యంలో ఉంది.
- Advertisement -