నవతెలంగాణ-హైదరాబాద్ : ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారులకు గుడ్న్యూస్ చెప్పింది. ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని ఈపీఎఫ్ఓ సవరించింది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. అంటే రూ.5 లక్షల వరకు క్లెయిమ్లు త్వరితగతిన సెటిల్ కానున్నాయన్నమాట. అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. కొవిడ్ సమయంలో ఆటోసెటిల్మెంట్ విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది.
ఏమిటీ ఆటో సెటిల్మెంట్?
సాధారణ క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్లను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్ ముఖ్య ఉద్దేశం. వివాహం, ఉన్నత విద్య, ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్ ఆటో- సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని సాయంతో ఇకపై రూ.5 లక్షల వరకు మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లెయిమ్ పొందొచ్చు.