– ఆ ముగ్గురూ కూడబలుక్కుని ఒకటే సమాధానం
– కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు గుప్పిస్తున్న బీజేపీ జాతీయ నేతలు
– ఈటల మాత్రం తప్పే జరగలేదన్నట్టు వ్యాఖ్యలు
– దీంతో హరీశ్, ఈటల భేటీ నిజమని తేలింది : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం అవినీతికి సంబంధించిన విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్…కేసీఆర్ను రక్షించేందుకు వకల్తా పుచ్చుకు న్నట్టు వ్యాఖ్యానించారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్ విమర్శించారు. కేసీఆర్, హరీశ్రా వు, ఈటల రాజేందర్ కూడబలు క్కుని ఒకే సమాధానం చెప్పినట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ తప్పేమీ లేదన్నట్టుగా ఈటల వ్యాఖ్యలు చేశారని తెలిపారు. క్యాబినెట్ నిర్ణయం మేరకే జరిగిందంటూ ఆయన బుకాయిస్తున్నారని విమ ర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల ప్రాజెక్టు నిధులతో తనకు సంబంధమే లేదనడం హాస్యాస్పదమని తెలిపారు. దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కోడై కూసిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఎన్నో సార్లు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది. వేల కోట్ల అవినీతి జరిగింది’ అంటూ ఆరోపించారని గుర్తుచేశారు. వారి విమర్శలకు భిన్నంగా ఈటల కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణ.. బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా ఉందని స్పష్టంచేశారు. కేసీఆర్తో ఆయన కుమ్కక్కైనట్టు అర్థమవుతోందని తెలి పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాటాలు ముట్టడం వల్లే ఆయన బీఆర్ఎస్ నాయకు లకు, బాస్ కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై పల్లెత్తు మాట కూడా విచారణ కమిషన్ ఎదుట చెప్పలేదని ఎద్దేవాచేశారు. ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఒత్తిళ్లమేరకే ఆ ప్రాజెక్టు అంచనా లను పెంచినట్టు ఈటల చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని పేర్కొన్నారు. ఆయన ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. ఈటల వ్యాఖ్యలతో హరీశ్రావుతో ఆయన రహస్యంగా భేటీ అయ్యారంటూ తాను చెప్పిన మాటలు నిజమేని తేలిందన్నారు. రైతుల ఒత్తిడితో అంచనా పెంచినట్టు ఈటల చెప్పారనీ, రైతులకు, కాళేశ్వరం అంచనాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందంటూ మొత్తుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడేం ముఖం పెట్టుకుని మాట్లాడతారని నిలదీశారు. దీనికి ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటలతోపాటు బీజేపీ నేతలకు కూడా కాళేశ్వరం కమిషన్లు అందాయా? రెండు పార్టీల లోపాయి కారీ ఒప్పందంమేరకు కేసీఆర్ను రక్షించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్ఏ సంపత్ కుమార్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు.
కేసీఆర్ను రక్షించేందుకు ఈటల వకాల్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES