- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్- ఇజ్రాయిల్ల మధ్య పెరుగతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ నుండి విద్యార్థుల తరలింపును భారత ప్రభుత్వం ప్రారంభించింది. అర్మేనియాలోకి సురక్షితంగా ప్రవేశించిన 110 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్ రేపు ఢిల్లీకి విమానంలో బయలుదేరనున్నట్లు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. టెహ్రాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు వెంటనే అక్కడి నుండి ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత్ తాజా ప్రకటన జారీ చేసింది. అత్యసర హెల్లైన్ నెంబర్లు 989010144557, 989128109115, 989128109109 కూడా విడుదల చేసింది.
- Advertisement -