నవతెలంగాణ పెద్దవంగర: రేపటి నుంచి ఈనెల 19 వరకు జరిగే బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో వేణుమాధవ్, మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో బడిబాట కార్యక్రమం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశం మేరకు ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని, అదే ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమ లక్ష్యమన్నారు. చదువుకు దూరమైన పిల్లలందరినీ మళ్లీ బడిలో చేర్పించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతిని తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విజయ కుమార్, ఐసీడీసీ సూపర్ వైజర్ శోభ, సీసీ సుధాకర్, శ్రావణి, ఉప్పలయ్య, కవిరాజు, సీఆర్పీలు వేముల సంతోష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
బడిబాట లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES