Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతిర్మలాపుర్ సీఎం సభకు సర్వం సిద్ధం..

తిర్మలాపుర్ సీఎం సభకు సర్వం సిద్ధం..

- Advertisement -

నేటితో నెరవేరుతున్న గంధమల్ల ప్రాజెక్టు కల 
బీడు భూములకు గోదావరి జలాలు
అన్నదాతల ముఖంలో ఆనందం కోసం
నేడు సీఎం రాక ..
నవతెలంగాణ – బొమ్మలరామారం/ తుర్కపల్లి 
: ఆలేరు నియోజకవర్గం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గంధమల్ల ప్రాజెక్టుకు మోక్షం కలిగింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వాయర్ పనులు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యాదాద్రి మెడికల్ కళాశాల, వేద పాఠశాల, ఆర్అండ్ బీ రోడ్లు, గోదాములు, మోటకొండూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాలతో పాటు ఇతర అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిర్మలపూర్ నేడు సీఎం సభ అధికారులు ఏర్పాటులను మమ్మురంగా చేశారు.వేలాది కోట్ల విలువైన పనులకు సీఎం రేవంత్ రెడ్డి తిర్మలపూర్ లోనే శిలాఫలకాలు వేయనున్నారు. అక్కడే బహిరంగ సభలో ప్రసంగించునున్నారు.ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, పనులను తీరును పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు.

తిర్మలపూర్ శివారులో 12 ఎకరాలు విస్తీర్ణంలో వేదిక వేసి పనులు మమ్మురంగా సాగుతున్నాయి.వర్షాకాలం మొదలవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేశారు. వేదిక మధ్యలో సభికులు వీక్షించేలా ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు.సభా వేదికకు సుమారు 350 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ కు వృత్తి కారంలో 50 ఫీట్లతో సిసి వేశారు. దీని వెలుపల నుంచి 8 సీట్లు వృత్తి న్ని ఏర్పాటు చేశారు.సభ ప్రాంగణంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.వాసాలమర్రి వైపు రెండు చోట్ల 20 ఎకరాల పార్కింగ్ కు ఏర్పాటు చేశారు.రాచకొండ ట్రాఫిక్ డిసిపి మల్లారెడ్డి , భువనగిరి ఏసీపీ భాస్కర్ రెడ్డి ఆ స్థలాలలో పరిశీలించారు.నేడు సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాగణంలో విద్యుత్ ఫ్లైట్లను నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు చర్యలు ప్రారంభించారు.

ఆనాడు నుండి ఈనాడు వరకు..

2018లో ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్.. గంధమల్ల రిజర్వాయర్ నిర్వహించి ఆలేరును సస్యశ్యామల చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరి జలాలు మళ్లింపు చేపట్టి కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో భాగంగా నిర్వహిస్తామని ప్రకటించారు. రిజర్వాయర్ను 9.8 టీఎంసీలతో నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత 4.28 టీఎంసీల నిలువ సామర్థ్యంతో నిర్వహించాలని ప్రతిపాదించారు 2019 ఫిబ్రవరిలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయింది. రిజర్వాయర్ కు 2,618 ఎకరాల కాల్వకు 3,841 ఎకరాలను కలిసి మొత్తంగా 6,459 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 1.5 టీఎంసీలకు నిర్వహిస్తామని ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ రిజర్వాయర్ పై అప్పటి సర్కార్ అటువైపు చూడకుండానే వెళ్ళిపోయింది. 

భారీ భద్రత.. 

 తిరుమలాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు గ్రామంలో బహిరంగ సభస్థలిని పరిశీలించారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, పబ్లిక్ గ్యాలరీ, స్టేజి, పైలాన్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. గంధమల్ల చెరువు వద్దకు వెళ్లి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయిదుగురు డీసీపిలు,12 మంది అదనపు డీసీపీలు, 20 మంది ఏసీపీలు, సిఐలు 50 మంది, ఎస్సైలు 150 మంది, ట్రాఫిక్, సివిల్, సిఆర్పిఎఫ్ తో పాటు మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించమని తెలిపారు.సీఎం పర్యటనకు పోలీస్ శాఖ తరపున పగడ్బందీ భద్రత చర్యలను చేపట్టనున్నట్లు వెల్లడించారూ. పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు‌. సభకు ప్రజలు వచ్చే బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

సభకు హాజరుకానున్న మంత్రులు..

అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆయా శాఖల మంత్రులు రేవంత్ రెడ్డి వెంట రానున్నారు.మంత్రులు పొంగులేటి ప్రతి శ్రీనివాసరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హాజరుకానున్నారు.

సాగునీరుతో ఆలేరు సస్యశ్యామలం : ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్, అయినాలా చైతన్య మహేందర్ రెడ్డి 

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గం సాగునీటి జలాలు తీసుకువచ్చి పూర్తిగా సస్యశ్యామలం చేస్తున్నారని, నేడు జరిగే సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.30 ఏళ్ల కల నేటితో నెరవేరిందని రైతన్నల కన్నునిండా ఆనందం కలుగుతుందని అన్నారు.గంధమల్ల రిజర్వాయర్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందజేయవచ్చని అన్నారు. రూ. 1500 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుమలాపూర్ లో సాముహిక శిలాఫలకాలను శంకుస్థాపన చేయనున్నారని వివరించారు.

సీఎం శంకుస్థాపన చేయనున్న పనులివే..

కార్యక్రమం 

1)గంధమల్ల రిజర్వాయర్ – (1.41 టీఎంసీలు)  రూ.700 కోట్లు 
2)ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్  – రూ.200 కోట్లు 
3)యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల- రూ.180 కోట్లు 
4)యాదగిరిగుట్టలో వేద పాఠశాల- రూ .25 కోట్లు
5)దాతర్ పల్లి లో వేర్ హౌస్  – రూ.15 కోట్లు
6)సి ఆర్ ఆర్ , ఎం ఆర్ ఆర్ రోడ్డు- రూ.30 కోట్లు
7) యాదగిరిగుట్ట టెంపుల్ అభివృద్ధి – రూ.100కోట్లు
8) కొలనుపాక, కాల్వపల్లి హైలేవర్ బ్రిడ్జిలు- రూ .14.50 కోట్లు 
9) నియోజకవర్గంలో ఆర్ అండ్ బి రోడ్డు – రూ.50 కోట్లు 
10) మోటకొండూరూ లో ఎంపీపీ, తాసిల్దార్,  పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు – రూ.10 కొట్టు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -