- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాలోని మల్కాన్ఆరిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల 150 ఇళ్లపై గిరిజనులు దాడి చేశారు. కర్రలు, కత్తులతో దాడికి దిగారు. ఇటీవల లెక్ పాడియామి అనే మహిళ హత్యకు బెంగాలీలే కారణమనే అనుమానంతో ఈ వివాదం చెలరేగింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు కర్ఫ్యూ విధించి, 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
- Advertisement -



