- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తనకు టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ ఎంఏ ఫయిమ్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫయిమ్ మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
- Advertisement -