- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కొన్ని కట్టుకథలు వస్తున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ‘సైట్ విజిట్’ అనే నిబంధనను కోల్ ఇండియా 2018లో పెట్టిందని చెప్పారు. దీని ప్రకారమే సింగరేణి 2021లో సైట్ విజిట్ను తప్పనిసరి చేసిందన్నారు. 2018, 2021లో తాము అధికారంలో ఉన్నామా? అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. సింగరేణి అనేది స్వయంప్రతిపత్తి సంస్థ అని, సంస్థలో ప్రతి నిర్ణయం మంత్రిమండలి వద్దకు రాదని చెప్పారు.
- Advertisement -



