Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం రైతు పొలం బాట కార్యక్రమంలో భాగంగా జంగంపల్లి గ్రామ రైతులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ పొదుపు, కెపాసిటర్ల అమర్చడం, తెగిపడిన విద్యుత్ వైర్లు, లూజ్ లైన్ , వంగిన స్తంభాలు, విద్యుత్ తీగల చెట్టు కొమ్మలు తగలడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దోమకొండ ఏడీఈ సుదర్శన రెడ్డి, ఏఈలు సంకీర్త్, బాలాజీ, విద్యుత్ సిబ్బంది, రైతులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad