నవతెలంగాణ – ఆళ్ళపల్లి
అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని, నేటి నుంచి మండలంలోని రైతులకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయని స్థానిక ఎంపీడీవో, ఏఓ డి.శ్రీనివాస్, అనిల్ కుమార్ చెప్పారు. ఈ మేరకు సోమవారం వారు మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం పై రాష్ట్ర సీఎం ఎ.రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని హాజరైన రైతులకు చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాల పంటలకు పెట్టుబడి కోసం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ డబ్బులు వేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈ పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏటా రెండు సార్లు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శి వి.శిరీష, ఏఈఓ విజయ్ వంశీ, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, రైతులు టి.ముత్తిలింగం, ఎం.శేఖర్, పెండెకట్ల పాపారావు, జి.రామయ్య, వూకె ఎర్రయ్య, సయ్యద్ యూనుస్, సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రైతు భరోసా నిధుల జమ అవుతాయి..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES